అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్టు

నల్గొండ క్రైం : మహారాష్ట్రకు చెందిన ముగ్గురు సభ్యుల దొంగల ముఠాను నల్గొండ పోలీసులు పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి రూ. 24 లక్షల విలువైన బంగారు. వెండి నగలను స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో వీరిపై 31 చోరీ కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.