అకాల వర్షాల వల్ల ప్రతిరోజు రైతులకు ఏ ఈ ఓ లు అందుబాటులో ఉండాలి

జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు

లింగాల జనం సాక్షి ప్రతినిధి:

వ్యవసాయ శాఖ- మండలం పరిధిలో ఉన్న రైతు వేదికలు లింగాల,కోమటికుంట ,సురపూర్, గ్రామాల రైతు వేదికలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా వ్యవసాయ అధికారి-పి.వెంకటేశ్వర్లు,అచంపేట్ వ్యవసాయ సహాయ సంచాలకులు-ఎం.చంద్రశేఖర్, ఏఓ-నాగార్జున రెడ్డి. విస్తరణ అధికారులు ఏ ఈ ఓ లు సురేందర్ రెడ్డి, ప్రతినిత్యం వర్షాలు కుడుస్తున్న సందర్భంగా రైతులకు పంటల గురించి తీసుకోవలసిన జాగ్రత్తలు అవగాహన కల్పిస్తూ తప్పకుండా రైతులకు అందుబాటులో ఉండి, రైతు వేదికల వద్ద సమయపాలన పాటించాలి, గ్రామాలలో రైతులకు సమావేశాలు నిర్వహించి పంటల పై సలహాలు సూచనలు చేయాలని ఏ ఈ ఓ లను రైతులకు భరోసా కల్పిస్తూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు