డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలని లబ్ధిదారుల ధర్నా

 పేదల సొంతింటి కలను నిజం చేసేలా సీఎం కేసీఆర్‌ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ఇస్తే కాంగ్రెస్‌ ప్రభుత్వం అర్హులకు ఇండ్లు కేటాయించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నదని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పట్టాలు ఇచ్చిన అర్హులైన నిరు పేదలకు కేటాయింపులు చేయాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేట జిల్లా కేంద్రంలో కొత్త బస్టాండ్ వద్ద ధర్నా లబ్ధిదారులు ధర్నా చేపట్టారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇండ్ల నిర్మాణం పూర్తియి పంపిణీకి సిద్ధంగా ఉన్నా ఇవ్వకుండా కాంగ్రెస్‌ సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక పేదల సమ స్యలపై దృష్టి సారించడంలేదు. డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు పంపిణీకి సిద్ధంగా ఉన్నా నిర్లక్ష్యంగా వ్యవ హరిస్తు న్నదని మండిపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఆందోళనకారులను అరెస్టు చేశారు.