గుంజపడుగులో కార్డెన్ సెర్చ్

మంథని,( జనంసాక్షి): మంథని మండలం గుంజపడుగు గ్రామంలో శనివారం ఉదయం మంథని సీఐ రాజు ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. తెల్లవారుజామునే మంథని సర్కిల్ లోని మంథని ఎస్ఐ రమేష్, ముత్తారం ఎస్ఐ నరేష్, రామగిరి ఎస్ఐ చంద్రకుమార్ లతో పాటు సిబ్బందితో కలిసి సిఐ గ్రామంలో కార్టన్ సెర్చ్ నిర్వహించారు. గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ తనిఖీలు చేసి అనుమాన స్పందన వ్యక్తులపై విచారించారు. సరైన ధ్రువీకరణ పత్రాలు లేని 21 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకొని గ్రామస్తులతో సిఐ మాట్లాడారు. యువత ముత్తు పదార్థాలు కు దూరంగా ఉండాలని, గ్రామంలో శాంతి భద్రతల కోసం ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని పాత పేరు తీసేసి గ్రామానికి మంచి పేరు వచ్చే విధంగా అందరు సహకరించాలని సిఐ కోరారు.