మనిషి అనే వాళ్లు ఈ బియ్యం తింటారా

వికారాబాద్‌ జిల్లా కొడంగల్ నియోజకవర్గం గుండుమాల్ మండలం కొమ్మూర్ గ్రామంలో ప్రైమరీ, జిల్లా పరిషత్ పాఠశాలవిద్యార్థులు తినే బియ్యం బూజు పట్టడంతో విద్యార్థులు మధ్యాహ్నం భోజనం ఇంటి దగ్గర చేసి వెళ్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిహుటా హటిన కొమ్మూర్ గ్రామంలోని పాఠశాలకు చేరుకుని తనిఖీ చేశారు. బియ్యం నిల్వ గదిని పరిశీలించగా పురుగులు పట్టిన బియ్యం దర్శనం ఇచ్చాయి.సీఎం సొంత సొంత నియోజకవర్గంలోనే విద్యార్థుల పరిస్థితి ఇలా ఉంటే మిగతా చోట్లా ఎలో ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. కాంగ్రెస్ పాలనలో అన్ని వ్యవస్థలు భ్రష్టుపట్టాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ హయాంలో ఓ వెలుగు వెలిగిన గురుకులాలు, నేడు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పేదింటి పిల్లలు తినే తిండిపై సర్కారుకు చిన్నచూపు ఎందుకని ప్రశ్నించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టాలని డిమాండ్‌ చేశారు.