అక్కెనపల్లి గుట్టల్లో ప్రేమజంట ఆత్మహత్య

loveనల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండల పరిధిలోని అక్కినపల్లి వెంకటేశ్వరస్వామి గట్టుపై ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నల్గొండ మండలం దోమలపల్లికి చెందిన ప్రసన్న(18) అదే గ్రామానికి చెందిన రమేశ్‌(21) గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇటివలే ప్రసన్నకు మరోకరితో వివాహం నిశ్చయమవడంతో మనస్తాపానికి గురైన ఇరువురూ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.