అక్రమవసూళ్లకు పాల్పడుతున్న 30 మంది అరెస్ట్

రంగారెడ్డి,  జిల్లాలో లారీ డ్రైవర్ల నుంచి అక్రమంగా వసూళ్లకు పాల్పడ్డుతున్న 30 మందిని మేడ్చల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మేడ్చల్ చెక్‌పోస్టు వద్ద కొంతమంది వ్యక్తులు ముఠాలుగా ఏర్పడి లారీ డ్రైవర్లను బెదిరించి పెద్ద మొత్తంలో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. అక్రమ వసూళ్లకు పాల్పడినవారిలో విద్యార్థులు, ప్రైవేటు ఉద్యోగులు కూడా ఉన్నారు.