అత్యాచార బాధిత యువతి కుటుంబానికి అండ

మద్దతుగా ఆందోళనకు దిగిన విపక్షాలు
మహబూబాబాద్‌,ఫిబ్రవరి24(జనం సాక్షి): మహబూబాబాద్‌ జిల్లా ఆస్పత్రి ఎదుట ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీజేపీ సీపీఐ, సీపీఐఎంఎల్‌ న్యూడెమెక్రసీ పార్టీ శ్రేణులు రాస్తారోకోకి దిగారు. సామూహికంగా అత్యాచారానికి గురైన సుప్రియ కుటంబానికి రూ.50 లక్షల ఎక్స్‌ గ్రేషియా చెల్లించాలని ధర్నాకు దిగారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు. మృతదేహాన్ని తీసుకువెళ్లకుండా నిరసనకారులు
అడ్డుకున్నారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఇరువురి మధ్య వాగ్వాదం, తోపులాట జరగింది. దీంతో పరిస్థితి ఉద్రక్తతంగా మారింది.