అదపు తప్పి పొలాల్లోకి స్కూల్ వ్యాన్..

rqmjgoy2మహబూబ్‌నగర్ : జిల్లా వనపర్తి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు స్కూల్‌కు చెందిన వ్యాను అదపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. ఖాసీంనగర్‌ గ్రామ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. స్కూలు వ్యానులో 25 మంది విద్యార్థులు ఉన్నారు. డ్రైవరు కల్లును సేవించి వ్యాను నడపడం వల్లే ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు చెప్తున్నారు. వ్యానులో కల్లు బాటిల్‌ ఉండటంపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడ్డారు. డ్రైవర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఎన్నిసార్లు చెప్పినా డ్రైవర్ తన ప్రవర్తనను మార్చుకోలేదని ఓ విద్యార్థి తల్లి ఆవేదన వ్యక్తం చేసింది.