అదుపుతప్పి నిప్పుల్లో పడిపోయిన భక్తురాలు

2నల్లగొండ జిల్లా నార్కెట్ పల్లి మండలంలోని చెర్వుగట్టు రామలింగేశ్వరస్వామి ఆలయంలో అగ్నిగుండాల కార్యక్రమంలో ప్రమాదం జరిగింది. నిప్పురవ్వలపై నడిచే సమయంలో ఓ మహిళ అదుపుతప్పి పడిపోయింది. వెంటనే పక్కనే ఉన్న జనం ఆమెను నిప్పుల్లోంచి బయటకు రాగారు. స్వల్ప గాయాలతో బయటపడింది ఆమె. ఆ తర్వాత కార్యక్రమాన్ని కొనసాగించారు. వందల మంది భక్తులు అగ్నిగుండాలపై నడిచారు.