అధైర్య పడకండి.. అండగా ఉంటాం

సూరయ్య పల్లె గ్రామాల్లో భారీ వర్షం వాళ్ళ వరద ముంపు కు గురైన ఇళ్లను, ఇంటి ఇంటికి తిరుగుతూ పరిశీలించి బాధితులకు ధైర్యాన్ని చెప్పిన జడ్పీ ఛైర్మన్ పుట్ట మధూకర్
జనంసాక్షి, మంథని : పెద్దపల్లి జిల్లా
మంథని మండలం బెస్తపల్లి, సూరయ్య పల్లె గ్రామాల్లో గత కొద్ది రోజులుగా భారీ వర్షాల నేపథ్యంలో వరద నీట మునిగిన ఇళ్లను పరిశీలించి బాధితులకు ధైర్యాన్ని నింపుతూ,నష్టాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా ప్రయత్నం చేస్తున్నామని పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ తెలిపారు. జరిగిన నష్టాన్ని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తో, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తో మాట్లాడుతున్నమని బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా ప్రయత్నం చేస్తున్నామన్నారు.