అధ్యాపక పోస్టులకు దరఖాస్తులకు స్వీకరణ

గద్వాల్ టౌన్, ఫిబ్రవరి 8 (జనంసాక్షి):
ఉండవెల్లి  మండల కేంద్రంలోని మైనార్టీ గురుకుల జూనియర్ కళాశాల అలంపూర్-1లో తాత్కాలిక పద్ధతిని బోధించేందుకు అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి ప్రసాదరావు  ఒక ప్రకటనలో తెలిపారు. సివిక్స్ 1, ఎకనామిక్స్ 1 ఖాళీలు ఉన్నాయని, ఆయా సబ్జెక్టులలో బోధించేందుకు బీఈడీ తో పాటు పీజీలో 50 శాతం ఉత్తీర్ణత కలిగి ఉండాలని పేర్కొన్నారు. అర్హులైన మహిళా అభ్యర్థులు ఈ నెల 10వ సాయంత్రం 5 గంటల లోపు ఉండవల్లిలో మైనార్టీ గురుకుల జూనియర్ కళాశాల బాలికల విభాగంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు