అనుమానాస్పద స్థితిలో 9వ తరగతి విద్యార్థి మృతి

రంగారెడ్డిజిల్లా, సెప్టెంబర్‌ 6 : జిల్లాలోని పూడూరు మండలం, మన్నెగూడలో దారుణం జరిగింది. 9వ తరగతి చదువుతున్న విద్యార్థి నవీన్‌ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. నవీన్‌ మృతికి కారణమైనవారిపై చర్యలు తీసుకోవాలంటూ బీజపూర్‌-హైదరాబాద్‌ హైవేపై విద్యార్థులు రాస్తారోకో చేపట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నవీన్‌ మృతిపై దర్యాప్తు చేపట్టారు.