అన్నారం గ్రామ ప్రజలకు భోజనం మంచినీళ్ల ప్యాకెట్స్ పంపిణీ

పినపాక నియోజకవర్గం జూలై 16 (జనం సాక్షి): వారం రోజుల క్రితం కురిసిన వర్షాలకిమండలంలో గోదావరి ముంపుకు గురైన అన్నారం గ్రామ బాధితులకు మణుగూరు మండల మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో భోజనాలు, మినరల్ వాటర్ బాటిల్స్ లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గోదావరి ఉధృతి వల్ల అన్నారం గ్రామంలోని ఇళ్లు కూలిపోయి మరికొన్ని ప్రాంతాలలో ఇళ్లల్లోకి నీరు చేరి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారికి తక్షణ సహాయంగా భోజనాలు మంచినీళ్లు ఏర్పాటు చేయడం జరిగింది. నిరుపేదలకు ఏ కష్టం వచ్చినా ముందుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మణుగూరు మండల అధ్యక్ష కార్యదర్శులు వన్నం కృష్ణమోహన్, గాండ్ల సురేష్, మణుగూరు పిఎసిఎస్ చైర్మన్ కుర్రి నాగేశ్వరరావు, సొసైటీ డైరెక్టర్ మామిడిపల్లి సీతారాములు, సీనియర్ నాయకులు ఎడవల్లి వెంకటయ్య, వలసాల వెంకట రామారావు, ఆవుల కనకయ్య, మాదాసు సాయిబాబా, మీసాల దుర్గారావు, బత్తిని రామచంద్రరావు, హనుమంతరావు యూత్ అధ్యక్షులు మేడ నాగేశ్వరరావు ఎస్ .చరణ్ లు పాల్గొన్నారు.