అన్నివర్గాలకు సంక్షేమం: వేముల

నల్లగొండ,మే25(జ‌నంసాక్షి): రామన్నపేట మండలం శోభనాద్రిపురం గ్రామంలో నకిరేకల్‌ శాసనసభ్యులు వేముల వీరేశం నూతన గ్రామపంచాయితీ భవనాన్ని ప్రారంభించారు. అలాగే మరియు వివిధ అభివృద్ధి పనులకు శంకు స్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ జడ్పీటీసీ , గ్రామా సర్పంచు వార్డ్‌ మెంబర్లు గ్రామా ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలతో లబ్ది చేకూర్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రజల గుండెల్లో కొలువయ్యారని అన్నారు. సంక్షేమ పథకాలను అమలు చేసిన ప్రభుత్వానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. నిరుపేద కుటుంబాలకు చెందిన ఆడపిల్లల వివాహానికి కల్యాణలక్ష్మి పథకం, రైతులకు ఎకరానికి రూ.4 వేల వ్యవసాయ పెట్టుబడి, కనుమరుగవుతున్న వృత్తుల కు పూర్వవైభవం కల్పించిన ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. సంక్షేమ పథకాలను అమలుచేసి దేశానికి సీఎం కేసీఆర్‌ దిక్సూచిగా నిలిచారన్నారు.