అన్ని దానాల్లో కెల్లా అన్నదానం గొప్పది..

 

ముఖ్య అతిథులుగా ఎంపీపీ చంద్రమోహన్, సర్పంచ్ బట్టు శ్రీనివాస్

కేసముద్రం సెప్టెంబర్ 4 జనం సాక్షి / అన్ని దానాల్లో కెల్లా అన్నదానం గొప్పది అని బాణోత్ రాజేందర్ అన్నారు. ఆదివారం కేసముద్రం మండల కేంద్రం లోని బ్రాహ్మగారి గుడి తండా లో మహా అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా బాణోత్ రాజేందర్ మాట్లాడుతూ.. అత్యంత భక్తి శ్రద్దల తో నిర్వహిస్తున్న వినాయక నవరాత్రి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలని కోరారు. లోక కళ్యాణార్థం ఆది దేవుడికి పూజలు చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా ఎంపీపీ ఒలం చంద్ర మోహన్,సర్పంచ్ బట్టు శ్రీనివాస్,గుగులోత్ వీరు నాయక్ ,హరీష్ నాయక్ లు హాజరు అయ్యారు.వీరితో పాటు గా మోహన్,సుఖ్య,గణేష్,వెంకన్న,నరేశ్,సేవల్, శ్రీను,వీరు,అఖిల్,లోకేష్,బబ్లూ పాల్గొన్నారు.