అబద్దాలకోరు సిఎం కెసిఆర్‌

ఈటెలను బిజెపిలో నేనే చేర్పించా
బిజెపి శిక్షణా శిబిరంలో వివేక్‌
భద్రాద్రి కొత్తగూడెం,డిసెంబర్‌17(జనంసాక్షి): కేసీఆర్‌ది కుటుంబ, నియంతృత్వ పాలన అని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు గడ్డం వివేక్‌ వెంకట స్వామి అన్నారు. కేసీఆర్‌ అబద్దాల చెప్పే మోసగాడని ఆయన విమర్శించారు. భద్రాద్రి కొత్తగూడం జిల్లాలోని కొత్తగూడం క్లబ్‌లో బీజేపీ ఆధ్వర్యంలో శిక్షణ శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వివేక్‌ పై వ్యాఖ్యలు చేశారు. ’దుబ్బాక , హుజూరాబాద్‌లో బీజేపీ గెలిచే అవకాశాలున్నాయని కేంద్రానికి ముందే నివేదిక ఇచ్చాను. ఈటలను బీజేపిలో చేర్చడంలో కీలక పాత్ర పోషించాను. ఈటల గెలుపుకు తీవ్రంగా కృషి చేశాను. దుబ్బాక, హుజూరాబాద్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ కుట్రలను తిప్పికొట్టాం. గడిచిన ఏడు సంవత్సరాలలో తెలంగాణలో అవినీతి బాగా పెరిగిపోయిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ని చూపెట్టి ఎన్నికల్లో గెలవాలని కేసీఆర్‌ చూస్తున్నాడు. కేసీఆర్‌ కు వ్యతిరేకమైన వాతావరణం తెలంగాణలో ఏర్పడిరది. మందులో ’రా’ పోస్తాడని సంతోష్‌కి రాజ్యసభ సీటు ఇచ్చాడు. ఉమ్మడి రాష్టాన్రికి సరిపోయిన సెక్రటేరియట్‌.. తెలంగాణకు
సరిపోదని కొత్తది నిర్మిస్తున్నాడు. డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు కట్టడానికి నిధులులేవని.. పనికి రాని భవనాల కోసం వినియోగిస్తున్నాడు. కేసీఆర్‌ వల్ల సింగరేణి సంస్థలో ఉద్యోగాలు తగ్గాయి. కేసీఆర్‌ అబద్దాల కోరి, మోసగాడు. నిరుద్యోగ భృతి ఇస్తానని మరిచిపోయాడు. కేసీఆర్‌ ఖజానా ఖాళీ అయినందునే రైతుబంధు పథకాన్ని నిలిపేయాలని చూస్తున్నాడని ఆరోపించారు. రూ. 10 రూపాయలతో నిర్మించే ప్రాజెక్టుకు వెయ్యి రూపాయలు ఖర్చు చేస్తాడు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ నుంచి ఇప్పటికీ ఒక్క నీటి బొట్టు రాలేదు. కేంద్రం మంచి పథకాలు అమలు చేస్తోంది. కేంద్ర నిధులను రాష్టాల్రు సరిగా వినియోగించుకుంటే.. కేంద్రం డైరెక్ట్‌ గా స్కీం ఫండిరగ్‌ చేయడానికి కృషి చేస్తున్నాను. ప్రపంచంలోనే ఎక్కువ వ్యాక్సినేషన్‌ ఇండియాలోనే జరుగుతోందని వివేక్‌ అన్నారు.