అభివృద్ధిని చూసి ఓర్వలేకనే లేనిపోని ఆరోపణలు.

ఎమ్మెల్యే పై బురదజల్లే ప్రయత్నం చేస్తే సహించేది లేదు.
తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్.
తాండూరు జూన్ 24(జనంసాక్షి)స్తానిక ఎమ్మెల్యే ఫైలట్ రోహిత్ రెడ్డి చేసే అభివృద్ధిని చూసి  కావాలని ఆరోపణలు చేస్తున్నారు ఇది ఎంతవరకు సమంజసమని తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్  ప్రశ్నించారు.శుక్రవారం ఓప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా చైర్మన్ విఠల్ నాయక్ మాట్లాడుతూ తాండూర్ అభివృద్ధి ధ్యేయంగా ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు.  అయితే రెండు సంవత్సరాల పాటు కరోనా మహమ్మారి తో యావత్ ప్రపంచం అతలాకుతలం అయింది. తాండూరు నియోజకవర్గంలో ఆగిపోయిన అభివృద్ధి పనులు ఎమ్మెల్యే చోరువ తో ఔటర్ రింగ్ రోడ్, మరియు బూత్ పూర్ నుండి చించోల్లి వరకు హైవే రోడ్డు ,జిల్లాలో డిఎం
ఎఫ్ నిధులు తీసుకోచ్చిన ఘనత ఎమ్మెల్యేకే దక్కిందన్నారు. దీంతో పాటు యువతకు ఎమ్మెల్యే స్వయంగా వివిధ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించారు. తాండూరులో ఇద్దరు రాజకీయ నాయకులు కలిసి కావాలనే ఎమ్మెల్యే పైన లేనిపోని విషయాలను కల్పిస్తూ  ఎమ్మెల్యేపై రాజకీయంగా ఎదుర్కోలేక కావాలని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. రాబోయే 2023 సంవత్సరం.ఎన్నికల్లో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మరోసారి ఘనవిజయం సాధిస్తారని అదే విధంగా మంత్రి కూడా అవుతారని ధీమా వ్యక్తం చేశారు .ఎమ్మెల్యే పై నిందలు ఆరోపిస్తే సహించేది లేదన్నారు. అయితే మరోవైపు ఎమ్మెల్యే తండ్రి అయిన విట్టల్ రెడ్డి ఎలాంటి రాజకీయ డబ్బులకు ఆశించే వ్యక్తి కాదనీ , దానధర్మాలు చేసే వ్యక్తి, అలాంటి వ్యక్తిపై కావాలనే బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు.