అమరుల ఆశయాలను ముందుకు తీసుకెళ్దాం — న్యూ డెమోక్రసీ మండల కార్యదర్శి భానోత్ ఊక్లా

టేకులపల్లి, నవంబర్ 1( జనం సాక్షి ):పేద, బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం విప్లవోద్యమంలో ఎందరో అమరులైన అమరవీరుల ఆశయాలను ముందుకు తీసుకెళ్దామని న్యూ డెమోక్రసీ మండల కార్యదర్శి బానోతు ఊక్లా అన్నారు. అమరవీరుల సంస్మరణ సభలు నవంబర్ 1 నుండి 9 వరకు పార్టీ పిలుపులో భాగంగా మంగళవారం టేకులపల్లి మండలం కేంద్రం తో పాటు కిష్టరం లో ఉన్న కాచనపల్లి అమరవీరుల స్థూపం వద్ద మండల నాయకులు భూక్య హర్జ్య, నెల్లూరి నాగేశ్వరరావు జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో న్యూడెమెాక్రసి మండల కార్యదర్శి బాణొతు ఊక్లా మాట్లాడుతూ భారత విప్లవోద్యమం లో అనేక మంది విప్లవ కారులు అమరులైనరని ప్రజల కోసం అనేక మంది కామ్రేడ్స్ తమ అమూల్యమైన ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారన్నారు. ఈ అమరులు తమ అమరత్వం తో మనకు కర్తవ్యాన్ని నిర్దేశించిన దానిని మనం సాధించి తీరాలని ఆయన అన్నారు. టేకులపల్లి మండలలో విప్లవ ఉద్యమం లో చివరి వరకు పొరాడిన్న కామ్రేడ్ నోముల పరుశురామన్న, చింత లక్ష్మి, నంబూరి సితారామరావు, నర్ర సుశేన, జార లక్ష్మయ్య, రాయల వాసు, తొటకూరి వెంకటేశ్వర్లు, కాంపాటి చంద్రం, జొగ పొత్తయ్య, బాడిశ కృష్ణమూర్తి, సుక్య, బన్సిలాల్ ఇలా అనేక మంది మండలం లో విప్లవ ఉద్యమం లో కీలక పాత్ర పోషించారన్నారు. ఇక్కడ జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించి పోరాటాలు నిర్వహించారని, వారి అమరత్వం స్మరిస్తూ జోహార్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు నోముల భానుచందర్, తొటకూరి సతీష్, మంచా, రామస్వామి, నర్సింగ్, నాగేశ్వరరావు, దళ్ సింగ్, శంకర్,కిరణ్ తదితరులు పాల్గొన్నారు.