అమ్మఒడి ఆధ్వర్యంలో అన్నదానం.
అన్నదానం చేస్తున్న సభ్యులు.
బెల్లంపల్లి, సెప్టెంబర్ 4, (జనంసాక్షి)
బెల్లంపల్లి పట్టణంలోని కాంటా ఏరియా బస్టాండ్ వద్ద శుక్రవారం అమ్మఒడి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అన్నదానం చేపట్టారు. ఈసందర్భంగా అమ్మఒడి అన్నదాత ప్రాజెక్టు బెల్లంపల్లి బ్రాంచ్ మేనేజర్ హనుమండ్ల మదుకర్ మాట్లాడుతూ అన్నమో రామచంద్ర అని ఆకలితో అలమటిస్తున్న వారి ఆకలి బాధను తగ్గించడానికి తమ వంతు సాయంగా అన్నదానం కార్యక్రమం ప్రారంభించామని తెలిపారు. బెల్లంపల్లి పట్టణం కన్నాలబస్తీ మదునన్న నగర్ కు చెందిన సబ్బని రమ్య పుట్టినరోజు సందర్భంగా మరియు ఆమె అమ్మమ్మ గజం రాజుబాయి జ్ఞాపకర్థం 147వ అన్నదానం చేపట్టినట్లు అయన పేర్కొన్నారు. బెల్లంపల్లి పట్టణంలోని కాంటా చౌరస్తా పల్లెటూరి బస్టాండు వద్ద యచకులకు, నిరుపేదలకు, కూలీలకు, బాటసారులకు, సుమారు 200 మందికి అన్నదానం చేసినట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో దాత కుటుంబ సభ్యులు సబ్బని లక్ష్మీబాయి, కవిత, అక్షయ్, అమ్మఒడి సభ్యులు సువర్ణ, అమూల్య, గన్నెవరం తిరుమల చారి, రంగ సురేష్, నాగుల సురేష్, ప్రఖ్యాత్, దాడి పవన్(మల్లీశ్వరి) ఎండి యూసుఫ్, చెందుపట్ల లింగన్న పాల్గొన్నారు.