అమ్మాపురంలో నాల్గవ రోజు పల్లె ప్రగతి

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఐదో విడత “పల్లె ప్రగతి” కార్యక్రమంలో భాగంగా నాల్గవ రోజు మండలంలోని అమ్మాపురం గ్రామంలో స్థానిక సర్పంచ్ కడెం యాకయ్య ఆధ్వర్యంలో డోజర్ సహాయంతో రోడ్డుకు ఇరువైపులా పిచ్చి మొక్కలను  తొలగించడంతో పాటు పల్లె ప్రకృతి వనం,రోడ్డుకు ఇరువైపులా చెట్లకు జాలీలను బిగించారు.ఈ సందర్బంగా సర్పంచ్ యాకయ్య మాట్లాడుతూ..పల్లె ప్రగతిలో గ్రామ ప్రజలందరూ  స్వచ్ఛందంగా పాల్గొని,గ్రామాన్ని స్వచ్ఛ గ్రామంగా మార్చడానికి ప్రజల సహకారం ఎంతో అవసరమన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ-1 డోనుక ఉప్పలయ్య,స్పెషల్ ఆఫీసర్ నేతాజీ,పంచాయతీ కార్యదర్శి శ్రావణి,అంగన్వాడి టీచర్లు,ఆశ వర్కర్లు,గ్రామస్తులు,మహిళలు పాల్గొన్నారు.