ఆంధ్రా బ్యాంక్‌ సేవలను వినియోగించుకోవాలి : బాలునాయక్‌

నల్గొండ, జనవరి 29 (): కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫైనాన్సియల్‌ ఇంక్లూజర్‌ పథకం ద్వారా విస్తృతం చేస్తున్న ఆంధ్రాబ్యాంకు సేవలను ఖాతాదారులు వినియోగించుకోవాలని దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్‌ కోరారు. పట్టణంలోని ఎంపిడివో కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దేవరకొండకు చెందిన ఆంధ్రాబ్యాంకు ఏరియా  గ్రామాల్లో బ్యాంక్‌ సేవలు అందించే బాధ్యతను బార్‌ట్రానిక్స్‌ కంపెనీకి అప్పగించిందని, ఆ నేపథ్యంలో కంపెనీ కో- ఆర్డినేటర్ల వద్ద ఉండే స్మార్టు కార్డుల ద్వారా ఖాతాదారులు తమ ఖాతాల్లో నగదును తీసుకోవడం, జమ చేయడం చేసుకోవచ్చాన్నారు. అలాగే వృద్దులకు, వికలాంగులకు పింఛన్లు కూడా తమ ఖాతాల్లోనే జమ అవుతాయన్నారు. ఈ సమావేశంలో ఆంధ్రాబ్యాంకు  మేనేజర్‌ సుధీర్‌బాబు, ఎంపీడీవో విజయలక్ష్మి, మార్కెటింగ్‌ మేనేజర్‌ గోపీనాథ్‌, కో- ఆర్డినేటర్‌ లచ్చీరాంనాయక్‌ తదితరులు ఉన్నారు.