ఆటోను ఢీకొన్న లారీ: డ్రైవర్‌ మృతి

పెద్దపల్లి,జూన్‌15(జ‌నం సాక్షి ): పెద్దపల్లి మండలం బొంపల్లి వద్ద శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ఆటో డ్రైవర్‌ మృతి చెందారు. ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. వేగంగా వచ్చిన లారీ ఆటోను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో ఆటో ఎగిరి పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌ అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడు రచ్చపల్లికి చెందిన కాంపెల్లి మల్లయ్య (40)గా గుర్తించారు. పోస్టుమార్టం కోసం మల్లయ్య మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.