ఆటో బోల్తా, ఆరుగురికి గాయాలు

నవీపేట గ్రామీణం : మండల కేంద్రంలోని కాలార్‌ పాఠశాల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు గాయపడినట్లు ఎస్సై సుధాకర్‌ తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం నవీపేట నుంచి నిజామాబాద్‌ వైపు వెళుతున్న ఆటో ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి అదుపుతప్పి బోల్తా పడిరది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సుధాకర్‌ తెలిపారు.