*ఆత్మవిశ్వాసంతో ప్రయత్నం చేయాలి:ఎస్ఐలు, నవీన్ కుమార్,సైదులు గౌడ్.

స్సై, కానిస్టేబుల్ ఈవెంట్స్ లో అర్హత సాధించిన మహిళా అభ్యర్థులకు టీ షర్ట్లు పంపిణీ
నేరేడుచర్ల (జనంసాక్షి)న్యూస్.ఎస్ ఐ,కానిస్టేబుల్ ఈవెంట్స్ లో అర్హత సాధించిన మహిళా అధ్యర్థులకు కె ఎల్ ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 15 మందికి టీషీర్ట్లు పంపిణి చేశారు.నేరేడుచర్ల ప్రభుత్వ జూనియర్ కాలేజీ లో కేతిరెడ్డి లచ్చిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ శకుంతల రెడ్డి  భర్త లచ్చిరెడ్డి  ద్వితీయ వర్ధంతి సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నేరేడుచర్ల,పాలకవీడు ఎస్ఐలు  నవీన్ కుమార్, సైదులు గౌడ్ ల చేతుల మీదుగా టీషీర్ట్లు పంపిణి చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూఎస్ఐ,కానిస్టేబుల్ అభ్యర్థులకు క్రీడా మైదానంలో శిక్షణ తీసుకుంటున్న అభ్యర్థులకు సూచనలు,సలహాలు చేశారు.సాధన చేస్తేనే విజయం సాధించవచ్చు అని ప్రాక్టీస్ చేసే క్రమంలో ఎలాంటి గాయాలకులోను కావద్దన్నారు.ఈ కార్యక్రమంలో రాపోలు నవీన్ కుమార్,పల్లెపంగు నాగరాజు, సరికొప్పుల నాగేశ్వరావు,జీలకర్ర రామస్వామి,జింకల భాస్కర్,కర్రీ సతీష్ రెడ్డి,తక్కెల్ల నాగార్జున,షేక్ ఇంటతియాజ్ తదితరులు పాల్గొన్నారు.