ఆదర్శ జెమాక్స్ కాలనీ వాసి సిహెచ్ రవి డాక్టరేట్

-గవర్నర్ చేతుల మీదుగా డాక్టరేట్ ప్రదానం
సంగారెడ్డి టౌన్ జనం సాక్షి
 : సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధి లోని ఆదర్శ జెమాక్స్ కాలనీకి చెందిన సి.హెచ్ రవి కి ఉస్మానియా విశ్వ విద్యాలయము డాక్టరేట్ ను ప్రధానం చేసింది. రవి ఉస్మానియా యూనివర్సిటీ లోని భూగోళ శాస్త్ర విభాగంలో ఇరిగేషన్ అండ్ ఆగ్రికల్చర్ పాటర్న్ ఇన్ (పాపన్నపేట్ మండలo మెదక్ జిల్లా) అనే అంశంపై వి పి బాలకిషన్ పర్యవేక్షణలో పరిశోధన గ్రంథం సమర్పించారు. ఉస్మానియా యూనివర్సిటీ విశ్వ విద్యాలయం 82వ కాన్వకేషన్ లో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ చేతుల మీదుగా
డాక్టరేట్ ను అందుకున్నారు. రవి ప్రసుత్వం యాదాద్రి జిల్లా బొమ్మలరామారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆంగ్ల ఆద్యాపకునిగా పనిచేస్తున్నారు . తనను ఈ స్థాయికి చేరుకోవడానికి సహకరించిన తల్లి తండ్రులకు తన సతిమాణి విశ్వకళ కూతురు , కుమారునికి , కాలనీ నివాసులకు , హృదయపూర్వక ధన్యవాదలు తెలిపారు.