*ఆదర్శ మున్సిపాలిటీయే లక్ష్యం- మున్సిపల్ చైర్ పర్సన్ సుష్మా రెడ్డి*

*రాజేంద్రనగర్. ఆర్.సి (జనం సాక్షి)* : ఆదర్శ మున్సిపాలిటీయే లక్ష్యంగా అభివృద్ధి చేస్తున్నామని శంషాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ సుష్మా రెడ్డి అన్నారు.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 23వ వార్డు మధురా నగర్ లో కౌన్సిలర్ స్రవంతి శ్రీకాంత్ రెడ్డి తో కలిసి గురువారం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను ప్రారంభించిన మున్సిపల్ చైర్ పర్సన్ సుష్మారెడ్డి, వైస్ చైర్మన్ బండి గోపాల్ యాదవ్.
ఈ సందర్భంగా మాట్లాడుతూ శంషాబాద్ మున్సిపాలిటీ ఏర్పడిన నుండి ఇప్పటివరకు ప్రతి వార్డులో సీసీ రోడ్డు, అండర్ డ్రైనేజీ పనులు 60 శాతం పైగా పూర్తయ్యాయని మిగిలి ఉన్న పనులు అన్నిటిని అంచలంచలుగా పూర్తి చేస్తామన్నారు. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సహకారంతో మరిన్ని నిధులు తీసుకువచ్చి శంషాబాద్ మున్సిపాలిటీలో మౌలికవస్తుల కల్పనకు కృషి చేస్తామని శంషాబాద్ మున్సిపాలిటీని రాష్ట్రంలోనే ఆదర్శ మున్సిపాలిటీ అభివృద్ధి చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వెంకటేష్ గౌడ్,కో-ఆప్షన్ సభ్యులు కవితా ప్రసాద్, పిఎసిఎస్ చైర్మన్ మల్లారెడ్డి, టిఆర్ఎస్ పార్టీ వార్డు అధ్యక్షులు పవన్ గౌడ్, ప్రధాన కార్యదర్శి నరసింహ గౌడ్,జైహింద్ రెడ్డి, జల్లపల్లి శ్రీనివాస్, సుభాష్, శ్రీశైలం, యాదిరెడ్డి,నరేష్,రాజు,శివరాజ్ తదితరులు పాల్గొన్నారు.
ఫోటో రైటప్ : మధురా నగర్ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను ప్రారంభిస్తున్న మున్సిపల్ చైర్ పర్సన్ సుష్మారెడ్డి.
Attachments area