చీరాలలో విషాదం..

` సముద్రంలో ఐదుగురు గల్లంతు
చీరాల(జనంసాక్షి):బాపట్ల జిల్లా చీరాల మండలం వాడరేవు తీరంలో విషాదం నెలకొంది. సముద్రంలో స్నానానికి దిగిన ఐదుగురు అలల తాకిడికి గల్లంతయ్యారు. వారిలో ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. సెలవు రోజుల్లో సరదాగా గడిపేందుకు సందర్శకులు సూర్యలంక బీచ్తో పాటు, వాడరేవు సముద్ర తీరానికి వస్తుంటారు. ఈ క్రమంలో అమరావతిలోని విట్ యూనివర్సిటీ నుంచి కొందరు విద్యార్థులు బృందంగా వాడరేవు వచ్చారు. వారిలో సాకేత్, సాయి మణిదీప్, జీవన్ సాత్విక్లు అలల తాకిడికి కొట్టుకుపోయారు. స్థానికంగా ఉన్న మత్స్యకారులు, గజ ఈతగాళ్లు వారిని కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. గల్లంతైన కాసేపటికి మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. మరో విద్యార్థి సోమేష్తోపాటు చీరాలకు చెందిన గౌతమ్ సముద్రంలో గల్లంతయ్యారు. వీరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.