ఆదిత్య 369’ తరువాత అంతటి సినిమా

బింబిసార చిత్రంపై కళ్యాణ్‌ రామ్‌
బింబిసార సినిమా చేయడానికి ధైరాన్నిచ్చింది తారక్‌ చెప్పిన మాటలే’.. అన్నారు నందమూరి కల్యాణ్‌ రామ్‌ . ఆయన హీరోగా నటించిన ఈ తాజా చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో జోరుగా ప్రమోషన్స్‌ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా తాజా ఇంటర్వ్యూలో కల్యాణ్‌ రామ్‌ మాట్లాడుతూ..’
చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకూ ప్రతి ఒక్కరూ ఫాంటసీ సినిమాలను ఇష్టపడతారు. తెరపై చూస్తూ బాగా ఎంజాయ్‌ చేస్తారు. ’ఆదిత్య 369’ తరువాత మళ్ళీ ఇప్పటివరకూ ఎవరూ ఇలాంటి పాయింటును టచ్‌ చేయలేదు.బింబిసార సినిమాలో నేను రాజుగా చేయాలనేసరికి చాలా ఆలోచించాను. ఈ జనరేషన్‌ కి ’రాజు’ అంటే అందరికీ ప్రభాస్‌ గుర్తొస్తారు. ఇలాంటి పాత్రను నేను చేయటం రిస్క్‌ అవుతుందా? అని అనుకున్నాను. రాజుగా నా లుక్‌, కాస్ట్యూమ్స్‌ ఎలా ఉండాలనే విషయంలో 2 నెలల కసరత్తు చేశాము. ఇక రాజుగా నా లుక్‌ ను నేను ముందుగా చూపించింది కూడా తారక్‌ కే. ‘బాగున్నా
వన్నయ్యా.. సెట్టయ్యావు.. సూపర్బ్‌‘ అన్నాడు. తారక్‌ అలా అనడంతో నాకు ఎంతో నమ్మకం కలిగింది’ అని చెప్పుకొచ్చారు. కాగా, ఆగష్టు 5న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. అందరూ కొత్త దర్శకుడిని నమ్మి ఇంతపెద్ద ప్రాజెక్టు ఎలా చేతిలో పెట్టావని అడుగుతున్నారు. మరి ’అతనొక్కడే’ సినిమా సురేందర్‌ రెడ్డికి మొదటి సినిమానే కదా’..అన్నారు.అంతేకాదు, ’అనిల్‌ రావిపూడి కి పటాస్‌’ గుహన్‌ కి ’118’ చిత్రాలు కూడా కొత్తే కదా. అయినా ఎలాంటి ఫలితం వచ్చిందో అందరికీ తెలిసిందే. అందుకే, కొత్తవాడైనా విశిష్ట్‌ వశిష్ఠ ’బింబిసార’ కథ చెప్పినప్పుడు అందులోని పాయింట్‌ నాకు బాగా నచ్చింది. ఇది ఖచ్చితంగా తెరపై వర్కౌట్‌ అవుతుందనే నమ్మకం కలిగింది. మూవీలో క్యాథరీన్‌ థ్రెసా సంయుక్తా విూనన్‌, వరీన హుస్సేన్‌ హీరోయిన్స్‌గా నటించారు.