ఆపదలో అండగా ముఖ్యమంత్రి సహయ నిధి

జహీరాబాద్ ఆగస్టు 17( జనంసాక్షి)
జహీరాబాద్ పట్టణనికి చెందిన నాయి బ్రాహ్మణ సోదరుడు తులసిరాం తల్లి ఎం.లక్ష్మి అనారోగ్యంతో
ఇబ్బంది పడుతు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందారు.కుటుంబ సభ్యులు వైద్య ఖర్చులకు ఆర్థిక సహయం కొరకు కోరడం జరిగింది.. బుదవారం బాధితురాలు లక్ష్మి కుమారుడు తులసిరం ముఖ్యమంత్రి సహయనిధి నుండి మంజూరు అయిన ఒక్క లక్ష రూపాయల చెక్కును టి.ఆర్.ఎస్ సీనియర్ నాయకుడు నామ రవికిరణ్ అందజేశారు.. తులసి రాం మాట్లాడుతూ ఆపదలో తమను అదుకున్న టి.ఆర్.ఎస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి కె.సి.ఆర్ కు జిల్లా మంత్రి వర్యులు హరీష్ రావు కు ,స్థానిక శాసన సభ్యులు మానిక్ రావు కు ,టి.ఆర్.ఎస్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జహీరాబాద్ నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు ప్రభు నాయి,నరేష్ రెడ్డి పాల్గొన్నారు.