ఆప్ సభ్యత్వ నమోదుకు అపూర్వ స్పందన జిల్లా కోఆర్డినేటర్ సయ్యద్ హైదర్

ఆమ్ ఆద్మీ పార్టీకి నిర్మల్ జిల్లాలో అపూర్వ స్పందన లభిస్తుందని ఆపార్టీ జిల్లా కోఆర్డినేటర్ సయ్యద్ హైదర్ అన్నారు, గత వారం రోజులుగా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు జిల్లాలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. తమపార్టీ గుజరాత్ ఎన్నికల్లో మంచిపలితాలు సాదినచ్చడంతో జాతీయ పార్టీగా గుర్తింపు లభించడం అభినందనీయమన్నారు.త్వరలో జరుగబోయే తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో ని అన్ని శాసనసభ స్థానాలకు పోటీచేస్తామన్నారు.రాష్ట్ర ప్రజలు టీఆరెస్ ప్రభుత్వం పై నమ్మకం కోల్పోయారన్నారు.తమ పార్టీ అధికారంలో ఉన్న ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని. పేద ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు. అందుతున్నాయని అన్నారు, తెలంగాణ ప్రజలు కూడా ఆప్ పార్టీ వైపు చూస్తున్నారని అన్నారు. ఈకార్యక్రమంలో పార్టీ నాయకులు రాజన్న, సాజిద్, రాజు తదితరులు పాల్గొన్నారు.