ఆయింట్‌మెంట్‌ పూసి.. కోట్లు కొల్లగొడుతున్నారు: రేవంత్‌రెడ్డి

మహబూబ్‌నగర్‌, మార్చి 20: సీఎం కేసీఆర్‌ తెలంగాణ సెంటిమెంట్‌తో ప్రజలకు ఆయింట్‌మెంట్‌ పూసి, కోట్లు కొల్లగొడుతున్నారని టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఆరోపించారు. జిల్లాలోని ఆమన్‌గల్‌లో బిజెపి ఎమ్మెల్సి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో టి.ఆచారితో, మాజీ ఎమ్మెల్యే రాములు పాటు రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘ఆంధ్రోళ్లు బాగో’ అన్న కేసీఆర్‌.. ఇప్పుడు ‘అందరికీ నేనున్నాను’ అంటున్నారు. ఇది ఎంతవరకు నమ్మదగినదని, సీఎం ఎలా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు.