ఆర్టీసీ బస్సు,లారీ ఢీ: నలుగురికి గాయాలు

:హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా యాచారం వద్ద సాగర్‌ రహదారిపై ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఇబ్రహీంపట్నం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.