ఆర్డీఓ, డిప్యూటి డైరక్టర్, ఆర్ఐ లపై వేటు..

నల్గొండ : యాదగిరిగుట్టలో ముగ్గురు అధికారులపై వేటు పడింది. ఆర్డీఓ సోములు నాయక్, డిప్యూటి డైరెక్టర్ విజయ్ కుమార్, ఆర్ఐ నాగరాజ్ లను జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు. గుట్ట పరిధిలోని ఆరు గ్రామాల్లో రిజిస్ట్రేషన్ లను నిలిపివేస్తూ గతంలో జారీ చేసిన ఆదేశాలను ఉల్లంఘిస్తూ మల్లాపూర్ లో 36 ఎకరాలకు పట్టా చేయడంతో వీరిపై వేటు వేశారు.