ఆలయానికి శంకుస్థాపన చేసిన ఎంపీ వెంకటేష్ నేత-ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు

దండేపల్లి.జనంసాక్షి నవంబర్10 దండేపల్లి మండలం కొండాపూర్ 19.46 లక్షలతో నిర్మిస్తున్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత.మంచిర్యాల నియోజకవర్గం ఎమ్మెల్యే నడిపల్లి. దివాకర్ రావు గురువారం శంకుస్థాపన చేశారు ముందుగా గ్రామంలో మహిళలు మంగళహారతులతో నాయకులను స్వాగతించారు.గ్రామంలో వేద పండితులు వేమునురి శివ చారి .వేద మంత్రాల తో స్వామివారి దర్శనం చేసుకొని మొక్కులు చెల్లించుకున్నారు అనంతరం. వెంకటేశ్వర స్వామి ఆలయానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ .ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామ ప్రజలు అందరు కలిసి ఈ గుడి నిర్మాణం పూర్తి చేయాలని అన్నారు .పెద్దమొత్తం ఖర్చుతో కూడినది అన్నారు ప్రభుత్వ పరంగా ఆలయానికి సహాయ సాకారం చేసే విదంగా చూస్తామని హామి ఇచ్చారు. ఆలయానికి ఎంపీ నిధులనుండి రోడ్డు వేస్తామని అన్నారు ప్రభుత్వ పరంగా గ్రామానికి అన్ని విధాలుగా పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు గ్రామాల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది అన్నారు ఈ కార్యక్రమంలో.నడిపల్లి ట్రస్టు చైర్మన్ టిఆర్ఎస్ యువ నాయకులు నడిపెల్లి విజిత్ రావు ఎంపీపీ గడ్డం.శ్రీనివాస్. సర్పంచ్ దాసరి.శాంతయ్య.ఎంపీటీసీ.మణెమ్మ.ఉపసర్పంచ్ ఇప్ప.రమేష్. ఆలయ కమిటీ అధ్యక్షులు ఇప్ప.సురేందర్. ప్రధాన కార్యదర్శి. ఎడ్ల.రామన్న.కోశాధికారి పులిశెట్టి.రాజయ్య. గ్రామస్తులు .మహిళలు తదితరులు పాల్గొన్నారు