ఆసరా పింఛన్లు పంపిణీ గురించి రేపు కోడేరు మండలానికి ఎమ్మెల్యే బీరం

(జనం సాక్షి) సెప్టెంబర్ 3 నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గం కోడేరు మండల పరిధిలోని కొండ్రావుపల్లి గ్రామంలో రేపు ఆదివారం ఉదయం 10:30 కు ఎమ్మెల్యే బీరం హర్ష వర్ధన్ రెడ్డి ఆసరా పింఛన్లు పంపిణీ కార్యక్రమం లో పాల్గొననున్నారు. అనంతరం నాగులపల్లి లో నాగులపల్లి తండాకు 11:30 ముతిరెడ్డిపల్లి, తుర్కదిన్నె, గ్రామాలకు 12:30కి  మరియు చుట్టుపక్కల తండాలకు 1:30 కి  కు అలాగే మాచుపల్లి గ్రామానికి 3:00 గంటల కు  రాజాపూర్ లో రేకులపల్లి తండాకు సాయంత్రం 4:00 గంటలకు అనంతరం ఉమ్మడి మైలారంలో ఠాకూర్ తండా ఎర్రన్న భావితాండ మరియు 5’00  గంటలకు ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి పర్యటించి ఆసరా పింఛన్లు లబ్ధిదారులకు పంపిణీ  చేయనున్నారు.కావునా  ఆయా గ్రామాల లో ఉన్న గ్రామ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గ్రామ సర్పంచులు ఎంపీటీసీలు తెరాస నాయకులు కార్యకర్తలు లబ్ధిదారులు సకాలంలో ఉండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని టీఆర్ఎస్ కోడేరు మండల పార్టీ అధ్యక్షులు సూర్య రాజశేఖర్ గౌడ్ తెలిపారు.