వయనాడ్‌లో ప్రియాంక గాంధీపై అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ

కేరళలోని వయనాడ్‌ లోక్‌సభ నియోజకవర్గంలో జరిగే ఉప ఎన్నికలకు తాజాగా బీజేపీ తమ అభ్యర్థిగా నవ్య హరిదాస్‌ పేరును ప్రకటించింది. ఇక్కడినుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా ప్రియాంక గాంధీ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అస్సాం, బిహార్‌, ఛత్తీస్‌గఢ్‌, కేరళ, కర్ణాటక, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, పశ్చిమ బెంగాల్‌లో ఖాళీగా ఉన్న అసెంబ్లీ స్థానాల ఉపఎన్నికలకూ బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది.