ఆసరా పింఛన్ల పంపిణీ గురించి రేపు కోడేరు మండలానికి ఎమ్మెల్యే బీరం రాక.

కోడేరు జనం సాక్షి సెప్టెంబర్ 3 నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గం కోడేరు మండల పరిధిలోని కొండ్రావుపల్లి గ్రామంలో రేపు ఆదివారము ఉదయము 10:30 గంటలకు ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభిస్తారు. అనంతరం నాగులపల్లిలో (నాగులపల్లి తండాకు)11:30 గంటలకు,ముత్తిరెడ్డిపల్లిలో (తుర్కదిన్నె)గ్రామాలకు 12:30 గంటలకు,మధ్యాహ్నము సింగాయిపల్లిలో మరియు (చుట్టుపక్కల తండాలకు) 1:30 కు, అలాగే మాచుపల్లి గ్రామానికి 3.00 గంటలకు, రాజాపూర్ లో(రేకులపల్లి తాండాలకు)సాయంత్రం 4.00 గంటలకు, అనంతరం ఉమ్మడి మైలారంలో (ఠాకూర్ తాండ- ఎర్రన్న బావితండా-నారియ నాయక్ తండల) 5.00 గంటలకు ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి పర్యటించి ఆసరా పింఛన్లు లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు. కావున ఆయా గ్రామాలలో ఉన్న గ్రామ తెరాస అధ్యక్షులు, గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, తెరాస నాయకులు,కార్యకర్తలు లబ్ధిదారులు సకాలంలో ఉండి పోగ్రామును విజయవంతం చేయగలరని టిఆర్ఎస్ కోడేరు మండల పార్టీ అధ్యక్షుడు సూర్య రాజశేఖర్ గౌడ్ తెలిపారు..