ఆసరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మేగా జాబ్ మేళా

 నాంపల్లి జూలై 9 (జనం సాక్షి)
ఆసరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువత కోసం మేగా జాబ్ మేళా నిర్వహించడంమైంది. ఈనెల 17 న చౌటుప్పల్ లో జరిగే మేగా జాబ్ మేళా వాల్ పోస్టర్లను శనివారం నాంపల్లి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో సబ్ ఇన్స్పెక్టర్ రజనీకార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగ,యువత ప్రతి ఒక్కరు ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగించుకోవాలని కోరారు. 50 కంపెనీ లు తీసుకొచ్చి యువతకు ఉద్యోగ అవకాశం కల్పించడం గొప్ప విషయంమనిన్నారు.
ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యుడు దామెర ఉత్తరయ్య, దాసరి లక్ష్మణ్, మంగి మహేష్, కరుణాకర్, కొండల్ , నరసింహ, శేఖర్ తదితరులు పాల్గొన్నారు