ఆ రెండు సీట్లు బిజెపికి ఎందుకిచ్చారు: కేటీఆర్‌

మహబూబ్‌నగర్‌, మార్చి 20: జిల్లాలోని నాగర్‌కర్నూల్‌లో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి దేవిప్రసాద్‌ ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. శుక్రవారం జరిగిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. బిజెపి చిన్న పార్టీ అన్న చంద్రబాబు.. రెండు సీట్లు ‘కమలానికి’ ఎందుకు కట్టుబెట్టారని ప్రశ్నించారు. బిజెపి వెనుక ఉండి చంద్రబాబు శిఖండి పాత్ర పోషిస్తున్నారన్నారు.