ఇంటింటికి మహాకూటమి విస్తృత ప్రచారం

కెసిఆర్‌ మూటల మనిషన్న జైపాల్‌ రెడ్డి

మహబూబ్‌నగర్‌,నవంబర్‌ 26(జ‌నంసాక్షి): జడ్చర్ల నియోజకవర్గం నవాబుపేట మండలకేంద్రంలోని పలు గ్రమాలలో మహాకూటమి అభ్యర్థి డా. మల్లు రవి నిర్వహించిన ప్రచారానికి మాజీ కేంద్ర మంత్రి జైపాల్‌/-రెడ్డి ముఖ్య అతిధిగా హాజర్యయారు . ఈ సందర్భంగా మల్లురవి మాట్లాడుతూ మొన్న జెడ్చెర్లలో

ముస్లిం భాయియో మల్లి తెరాసకి ఓటేయ్యండని విూకు 12 పర్సెంట్‌ రిజర్వేషన్‌ ఇస్తానని మాటలు పలికిన కెసిఆర్‌ ఐదు సంవత్సరాలు కాలంలో ఇవ్వలేనిది ఇప్పుడిస్తానంటే ఎవ్వరైనా నమ్ముతారా అని ప్రశ్నిచారు. భార్యని భర్త కొడితే, తాగొచ్చి గొడవపడితే పనికొపొయొచ్చాడు పర్వాలేదులే మల్లి మామూలైపోతాడని సర్దుకుపోతారు, కానీ అబద్దలుచెప్పే వాళ్ళ మాటల్ని నమ్మరని అన్నారు. మరి 100 అబద్దాలాడిన కెసిఆర్‌ నీకు ఓటెలావేస్తారని అనుకుంటున్నావని ఎద్దేవా చేశారు. వచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వమని తెరాస పని అయిపోయిందని మాజీ కేంద్ర మంత్రి సూదిని జైపాల్‌ రెడ్డి అన్నారు. కేసీర్‌ మాట మనిషి కాదని మాటల మనిషని, మూఠల మనిషని కమిషనులకొరకై ప్రయివేటు కంపెనీలకు కోట్ల రూపాయల కాంట్రాక్టులు ఇచ్చి సొమ్ముచేకున్నాడని విమర్శించారు.