ఇందిరమ్మ కలల కార్యక్రమం విజయవంతం చేయాలి

చిలుకూరు: దేశ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పేరుతో ప్రారంభమైన ఇందిరమ్మకల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తహశీల్దారు సూర్యనారాయణ, ఎంపీడీవో నాగిరెడ్డి అన్నారు. ఈ విషయమై సోమవారం ఎంపీపీ కార్యాలయంలో జరిగిన అధికారులతో సమీక్ష సమావేశం జరిగింది. మండలంలోని ఎస్సీ,ఎస్టీ కాలనీల్లో ఈ కార్యక్రమాలను నిర్వహించాలని అధికారులను తహశీల్దారు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల వ్వవసాయ అధికారి సతీష్‌, ఎంఈవో ఎన్‌, ఈశ్వర్‌రావ్‌, గ్రామ కార్యదర్శులు, వీఆర్వోలు పాల్గొన్నారు.