ఇక గోవాకు రెగ్యులర్‌ సర్వీసులు 

` సికింద్రాబాద్‌ నుండి కొత్త రైలు అందుబాటులోకి
` ప్రారంభించిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్‌(జనంసాక్షి): నగరం నుంచి గోవాకు వెళ్లే పర్యాటకులకు కొత్త రైలు అందుబాటులోకి వచ్చింది. ఈ రైలును కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో జెండా ఊపి ప్రారంభించారు.రెగ్యులర్‌ సర్వీసులు సికింద్రాబాద్‌ నుంచి ఈ నెల 9న, వాస్కోడగామా నుంచి 10న ప్రారంభమవుతాయి. సికింద్రాబాద్‌`వాస్కోడగామా (17039) రైలు ప్రతి బుధ, శుక్రవారాల్లో.. వాస్కోడగామా`సికింద్రాబాద్‌ (17040) రైలు ప్రతి గురు, శనివారాల్లో బయల్దేరుతాయి. ప్రస్తుతం సికింద్రాబాద్‌`వాస్కోడగామా మధ్య రెగ్యులర్‌ సర్వీసు (17603) ఉంది.