ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు నిండడంతో కట్టమైసమ్మ తల్లి దేవాలయం లో మొక్కు తీర్చుకున్న ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి

పెద్ద ఎత్తున తరలివచ్చిన రైతులు,టిఆర్ఎస్ శ్రేణులు

రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం/(జనంసాక్షి):- ఇబ్రహీంపట్నం పెద్దచెరువు నిండు కుండలా నిండి, అలుగు దూకి,  నియోజకవర్గ ప్రజల, రైతుల కోరిక నెరవేరినందున ఇబ్రహీంపట్నం కట్టపై  కట్టమైసమ్మ తల్లికి ఆదివారం  ప్రత్యేక పూజలు నిర్వహించిరు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి మాట్లాడుతూ పెద్ద చెరువు పెద్ద ఎత్తున నిండాలని  గతంలో వర్ణ యాగం కార్యక్రమాన్ని నిర్వహించానాని, అనేకసార్లు కట్టమైసమ్మ ఆలయంలో పూజ నిర్వహించినడం జరిగింది అని ఈ సందర్భంగా గుర్తు చేశారు. నియోజకవర్గంలో పెద్ద చెరువుతోపాటు అనేక చెరువులో పెద్ద ఎత్తున నిండడంతో ప్రజలు, రైతులంతా,మత్స్యకారులు అంత సంతోషంగా, , ఎల్లప్పుడూ అమ్మవారి దీవెనలు,ప్రజలు సుభిక్షంగా
వారికి సకలంగా ఉండాలని, నియోజకవర్గ ప్రజలుకు అమ్మవారి దీవెనలు, నియోజకవర్గ అభివృద్ధి మరింత  అభివృద్ధి చేసే విధంగా అమ్మవారి దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని అన్నారు. అనంతరం కట్ట మైసమ్మ సమీపంలో  రైతులకు ,మత్స్యకారులుకు, టిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు
అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సంఘం అధ్యక్షులు వంగటి లక్ష్మారెడ్డి, ఎంపిపి కృపేష్,మున్సిపల్ వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి,కర్నాటి రమేష్ గౌడ్,
మున్సిపల్ అధ్యక్షులు అల్వాల్ వెంకట్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి మడుపు వేణుగోపాల్ రావు, మండలాల అధ్యక్షులు చిలకల బుగ్గ రాములు, చీరాల రమేష్,సర్పంచ్ ల ఫోరమ్ జిల్లా అధ్యక్షులు బూడిద రాం రెడ్డి, ఉప్పరగూడ సహకార సంఘం చైర్మన్ సుదర్శన్ రెడ్డి, వైస్ చేర్మెన్ కాయమా శంకర్,రైతు సంఘం అధ్యక్షులు మొద్దు అంజిరెడ్డి, చైర్మన్లు  స్వప్న చిరంజీవి, కోరే కలమ జంగయ్య , తెరాస యువజన విభాగం నాయకులు జెర్కొని రాజు,   నిట్టు జగదీష్, కౌన్సిలర్లు బర్ల మంగా జగదీష్, మమతా శ్రీనివాస్ రెడ్డి, జెర్కొని బాలరాజు, భర్తాకి జెగన్, కసరమోని పద్మా మల్లేష్, నీలం శ్వేతా,సీనియర్ నాయకులు కాయితి మోహన్ రెడ్డ,బూడిద నాధరెడ్డి,మొద్దు వెంకట్ రెడ్డి,గుంటి బీమ్ రావ్, కాలే గణేష్,కాయతి దర్శన్ రెడ్డి,ముత్యాల చిన్న,బద్రి నాథ్గుప్తా,రమేష్ అంజిరెడ్డి,దూస వెంకటేష్,నర్సింహా రెడ్డి,గుజ శ్రీకాంత్ రెడ్డి,స్థానిక నాయకులు
ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ నాయకులు బంటీ యూత్ ఫోర్స్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Attachments area