ఇబ్రహీంపేట్ మత్స్య పారిశ్రామిక సంఘ ఏకగ్రీవ ఎన్నిక..

బాన్సువాడ,  జనంసాక్షి (జులై18):
మండలంలోని ఇబ్రహీంపేట గ్రామంలో మత్స్య పారిశ్రామిక సంఘ కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సోమవారం జిల్లా మత్స్య కార్మిక సహకార అధికారి ఆధ్వర్యంలో నూతన పాలకవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా అక్కంగారి రమేష్, ఉపాధ్యక్షులుగా హన్మండ్లు, కార్యదర్శిగా అక్కంగారి సాయిలు, కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు రమేష్ మాట్లాడుతూ నమ్మకంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్న సభ్యులకు కార్యవర్గ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. అందరి సహాకారులతో సంఘా లు ముందుండి నడిపిస్తానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ మత్స్య శాఖ సంఘం సభ్యులు సాయిలు, హన్మండ్లు, బస్వాబోయి కుల సంఘ పెద్దలు తదితరులు పాల్గొన్నారు
Attachments area