ఇరుముడి,భక్తిశ్రద్ధలతో పూజలు శబరిమల కు బయలుదేరిన అయ్యప్ప స్వాములు

కొండమల్లేపల్లి మండల కేంద్రంలో గల
శ్రీ సీతారామాంజనేయ చంద్రమౌళీశ్వర అయ్యప్ప దేవాలయంలోని  గురుస్వాములు  ప్రతాప్ రెడ్డి గురుస్వామి, ప్రభాకర్ రెడ్డి గురుస్వామి  ఆధ్వర్యంలో అయ్యప్ప మాలాధారణ దీక్ష  స్వాములకు ఇరుముడి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆదివారం ఇరుముడి కట్టుకున్న మలాదారుణదీక్ష స్వాములు మడ్ల  శ్రీనివాస్ రెడ్డి స్వామి, దుండిగల్ అశోక్ స్వామి తో పాటు మరో 10 మంది స్వాములు   అయ్యప్ప శబరి యాత్ర బయలుదేరారు. దీనికి ముందు అయ్యప్ప ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఇరుముడిలో ఏర్పాటు చేసిన ముద్ర టెంకాయ నెయ్యి నింపడానికి  శబరిమలలో సాక్షాత్తు అయ్యప్ప స్వామికి నిర్వహించే నేయాభిషేకంలో  భాగస్వాములు అయినట్లుగా భావించి పూజలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో యర్రమాద గోవర్ధన్ రెడ్డి గురుస్వామి, భూతరాజు సత్తయ్య స్వామి తోపాటు సంపెంగల సురేందర్,ఏరుకొండ రాము, బూడిద శ్రీనివాస్, తగ్గుల్ల యాదయ్య యాదవ్, మొహినుద్దీన్, బోడ అంజి యాదవ్, తేలుకుంట్ల వెంకట్ రెడ్డి, మాలే రవీందర్ రెడ్డి, మడ్ల వెంకట్ రెడ్డి,  తదితరులు పాల్గొన్నారు. తదితరులు పాల్గొన్నారు