ఇరువురిని పరామర్శించిన బలరాం జాదవ్.

మండలంలోని పిచేర గ్రామ పంచాయితీ సెక్రెటరీగా  విధులు నిర్వహిస్తున్న ఇచ్చోడ మండలం బోరిగాం గ్రామానికి చెందిన పంచాయితీ సెక్రటరీ రాజ్ కుమార్ రెడ్డికి ఇటీవల ప్రమాదవశాత్తు బైక్ ఆక్సిడెంట్ లో గాయాలపాలయ్యారు.ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ మంగళవారం రోజున వారి ఇంటికి వెళ్లి కలిసి పరామర్శించి యోగక్షేమాలు తెలుసుకున్నారు.
అలాగే తలమడుగు మండలం సాయిలింగి గ్రామానికి చెందిన అశోక్ తల్లికి చేయి ఫ్రాక్చర్ జరిగింది.అదిలాబాద్ దేవి ప్రియ హాస్పిటల్ కి బలరాం జాదవ్  వెళ్లి ఆమెను కలిసి పరామర్శించి త్వరగా కోలుకోవాలని మనో ధైర్యాన్నిచ్చారు