ఇల్లందు పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు పోలీసువారి విజ్ఞప్తి….

ఇల్లందు జూన్ 8 (జనం సాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణ పరిసర ప్రాంత ప్రజల శ్రేయస్సు కొరకు బానోత్ సీఐ రాజు సూచనలు ఇవ్వడం జరిగింది. ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షాల ప్రభావంతో ఇల్లందు పట్టణ పరిసర ప్రాంత గ్రామాలలో గత రాత్రి నుండి  ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానల వాగులు పొంగి ప్రవహిస్తున్న కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అవుతున్న కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండగలరు అని సూచనలు ఇవ్వడం జరిగింది. ఏ సమయంలో ఏ అవసరం వచ్చినా వెంటనే 100 కు డయల్ చేసి విషయం తెలియపరచిన వెంటనే అక్కడికి చేరుకొని ప్రమాదం జరగకుండా వారిని రక్షించే ఏర్పాటు చేస్తామని, ప్రజానీకానికి ధైర్యం చెప్పడం జరిగింది. అలాగేఎవరు కూడా ఉదృతంగా ప్రవహిస్తున్న వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయవద్దని,  కరెంటు స్తంభాలను కానీ, తడిగా ఉండే కరెంటు సరఫరా అయ్యే వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని మనవి చేశారు.
Attachments area