ఈటల మల్లయ్య మృతికి గంట రవికుమార్ సంతాపం

వరంగల్ ఈస్ట్, ఆగస్టు 24(జనం సాక్షి)
మాజీ మంత్రి హుజూరాబాద్ నియోజకవర్గ బిజెపి శాసనసభ్యులు  ఈటల రాజేందర్ తండ్రి  ఈటల మల్లయ్య  (104) పరమపదించారు. వారి పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని, ప్రజాసేవలో ప్రజల తరపున పోరాడుతున్న ఈటల రాజేందర్  కుటుంబానికి ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తూ, వారి పార్థివదేహానికి బుధవారం వరంగల్ తూర్పు నియోజకవర్గం బిజెపి నాయకులు గంట రవి కుమార్ పూలమాల వేసి నివాళులర్పించారు