ఈ నెల 29, 30 తేదీలలో జరగనున్న వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ ను జయప్రదం చేయండి ధనుంజయ నాయుడు విజ్ఞప్తి. పెన్ పహడ్.జూన్ 11(జనం సాక్షి) : హైదరాబాదులో జరగనున్న తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ ను జయప్రదం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనంజయ నాయుడు విజ్ఞప్తి చేశారు. శనివారంనాడు ఆయన పెన్ పహాడ్ మండల కేంద్రంలో పాత్రికేయులతో మాట్లాడుతూ. ఉపాధి హామీ పథకం పరిరక్షణ కొరకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, వామపక్ష పార్టీలు ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న ఉపాధిహామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని, ప్రతి బడ్జెట్లోనూ కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి నిధుల కోత విధిస్తున్నారు అని, కేంద్రం ఆటలు సాగనివ్వబోమని ఆయన అన్నారు. సంవత్సరానికి రెండు వందల రోజులు పని కల్పించి, రోజుకు ఆరు వందల వేతనం ఇచ్చేంతవరకు ఉద్యమిస్తామని, కేంద్రంలో బీజేపీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, అధిక,,ధ రలతో ప్రజలు అల్లాడిపోతున్నారు అని, వ్యవసాయ రంగాన్ని కార్పొరేటీకరణ చేసేందుకు కుట్ర పన్నుతున్నారని అందుకే రైతుల మోటార్లకు మీటర్లు బిగించేందుకు బిజెపి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతున్నాదని, గిట్టుబాటు ధర కు చట్టబద్ధత కల్పించాలని యావత్ దేశ రైతాంగం కోరుతు న్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వం పెడచెవిన పెడుతున్న దని, వ్యవసాయ రంగాన్ని నమ్ముకుని గ్రామీణ ప్రాంతాల్లో జీవిస్తున్న ఉపాధి కూలీలకు జీవిత భద్రత కల్పించాలని, ఆయన డిమాండ్ చేశారు. ఆయన వెంట వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు రావుల సత్యం, ఎల్ల బోయిన సింహాద్రి ఉన్నారు Attachments area

ఈ నెల 29, 30 తేదీలలో జరగనున్న వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ ను జయప్రదం చేయండి ధనుంజయ నాయుడు విజ్ఞప్తి. పెన్ పహడ్.జూన్ 11(జనం సాక్షి) :  హైదరాబాదులో జరగనున్న తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ ను జయప్రదం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనంజయ నాయుడు విజ్ఞప్తి చేశారు. శనివారంనాడు ఆయన పెన్ పహాడ్ మండల కేంద్రంలో పాత్రికేయులతో మాట్లాడుతూ. ఉపాధి హామీ పథకం పరిరక్షణ కొరకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, వామపక్ష పార్టీలు ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న ఉపాధిహామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని, ప్రతి బడ్జెట్లోనూ  కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి నిధుల కోత విధిస్తున్నారు అని, కేంద్రం ఆటలు సాగనివ్వబోమని ఆయన అన్నారు. సంవత్సరానికి రెండు వందల రోజులు పని కల్పించి, రోజుకు ఆరు వందల వేతనం ఇచ్చేంతవరకు  ఉద్యమిస్తామని, కేంద్రంలో బీజేపీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, అధిక,,ధ రలతో ప్రజలు అల్లాడిపోతున్నారు అని, వ్యవసాయ రంగాన్ని కార్పొరేటీకరణ  చేసేందుకు కుట్ర పన్నుతున్నారని అందుకే రైతుల మోటార్లకు మీటర్లు బిగించేందుకు బిజెపి ప్రభుత్వం  ప్రత్యేక చర్యలు  చేపడుతున్నాదని, గిట్టుబాటు ధర కు చట్టబద్ధత కల్పించాలని యావత్ దేశ రైతాంగం కోరుతు న్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వం పెడచెవిన పెడుతున్న దని, వ్యవసాయ రంగాన్ని నమ్ముకుని గ్రామీణ ప్రాంతాల్లో జీవిస్తున్న ఉపాధి కూలీలకు జీవిత భద్రత కల్పించాలని, ఆయన డిమాండ్ చేశారు. ఆయన వెంట  వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు రావుల సత్యం, ఎల్ల బోయిన సింహాద్రి ఉన్నారు
Attachments area